- ఇండియాలో రూ.10.44 లక్షలతో(ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
- మూడు వేరియంట్లలో, ఐదు ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో లభ్యం
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాలో మారుతి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్ రూమియన్ ని ఆగస్టు-2023లో లాంచ్ చేసింది. ఈ మూడు వరుసల ఎంపివి S, G, మరియు V అనే మూడు వేరియంట్లలో, ఐదు ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో మరియు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు, కియా కారెన్స్ తో పోటీపడుతున్న దీనికి ఇండియన్స్ నుండి అద్బుత స్పందన లభిస్తుండడంతో దేశవ్యాప్తంగా దీనిపై కొంతవరకు వెయిటింగ్ పీరియడ్ ఉండడం ప్రారంభమైంది.
కస్టమర్స్ ఎవరైతే రూమియన్ ఎంపివిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారో వారు బుకింగ్ చేసిన తేదీ నుండి సుమారుగా 6 నుండి 7 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్,మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ ఆటోమేకర్ రూమియన్ మోడల్ యొక్క సిఎన్జి వేరియంట్ల బుకింగ్స్ ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మీరు మీ సమీపంలో ఉన్న టయోటా-అధికారిక డీలర్షిప్ను సంప్రదించాలని కోరుతున్నాము.
ఇతర వార్తలలో చూస్తే, ఈ ఆటోమేకర్ తాజాగా రూమియన్ ధరలను రూ.15,000 వరకు పెంచింది. అదే విధంగా, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.5,000 వరకు పెరగగా, మాన్యువల్ వేరియంట్లపై రూ. 15,000 వరకు పెరిగాయి. ఈ పెరిగిన ధర తర్వాత, ఎర్టిగాతో పోటీపడుతున్న ఈ మోడల్ ధర రూ. 10.44 లక్షల నుండి రూ.11.39 లక్షలు (అన్ని, ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్