- ఏప్రిల్ 1, 2024 నుంచి అమలుకానున్న కొత్త ధరలు
- మూడు శాతం మేర పెరగనున్న కార్ల ధరలు
ఏప్రిల్-2024 నుంచి దాని అన్ని మోడల్స్ పై మూడు శాతం మేర ధరలను పెంచుతునట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ధరల పెరుగుదల మొదటిసారి కాగా, ధరలను పెంచడానికి వస్తువుల ధరలు మరియు సరఫరా సంబంధిత ఇన్పుట్స్ కారణమని బ్రాండ్ పేర్కొంది.
సెల్టోస్, సోనెట్ మరియు కారెన్స్ తో కూడిన ఆటోమేకర్ లైనప్ లో ఉన్న అన్నీ మోడల్స్ కొత్త ఎక్స్-షోరూం ధరలు ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడికానున్నాయి. సేల్స్ పరంగా చెప్పాలంటే, మొత్తంగా కియా 1.16 మిలియన్ల కార్లను విక్రయించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ సెల్టోస్ సేల్స్ 6.13 లక్షలు దాటగా, దాని తర్వాత 3.95 లక్షల కార్ల సేల్స్ తో సోనెట్ మరియు 1.59 లక్షల కార్ల సేల్స్ తో కారెన్స్ ఎంపివి నిలిచింది.
ముఖ్యంగా చెప్పాలంటే, ఈ మధ్యనే కియా కంపెనీ ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ లో సమస్య కారణంగా, పరిష్కరించడానికై 4,358 యూనిట్ల పెట్రోల్-సివిటి సెల్టోస్ కార్లను వెనక్కి రప్పించింది. అంతే కాకుండా, కియా ప్రస్తుతం ఫేస్లిఫ్టెడ్ కార్నివాల్ పై వర్క్ చేస్తుండగా, ఇది బహుశా మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్