- ఇటీవల క్రెటాపై కూడా పెరిగిన ధరలు
- హ్యుందాయ్ i20 వేరియంట్లలో మార్పులు
హ్యుందాయ్ ఇండియా దాని మోడల్ రేంజ్ లో ఉన్న సెలెక్టెడ్ కార్లపై ధరలను పెంచింది. పెరిగిన ధరలను ఇప్పటి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో ఈ నెలలో ఆయా కార్లపై ధరలను పెంచిన హోండా, కియా, టయోటా, మరియు ఎంజి బ్రాండ్ల సరసన హ్యుందాయ్ కూడా చేరిపోయింది.
వెన్యూలో అందించబడుతున్న S(O) 1.0 టర్బో ఎంటి మరియు S(O) 1.0 టర్బో డిసిటి వేరియంట్లు ఒక్కోదానిపై రూ. 35,000 పెరిగింది. ఇక హ్యుందాయ్ సబ్-4-మీటర్ ఎస్యూవీలోని ఇతర వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. అంటే, ఈ మోడల్ ధరలు రూ.7.94లక్షల నుంచి ప్రారంభమై రూ. 10.71 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఈ నెలలో హ్యుందాయ్ క్రెటాపై కూడా ధర పెరిగింది. ఈ పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీపై రూ. 10,800 వరకు ధర పెరగగా, ఇది మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, మరియు హోండా ఎలివేట్ తో పోటీ పడుతుంది. ఈ కొరియన్ బ్రాండ్ i20 లైనప్ లో మార్పులు చేయగా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్