- 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్లలో లభ్యం
- మార్చి రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న గూర్ఖా డెలివరీ
ఇండియాలో 2024 ఫోర్స్ గూర్ఖా రేంజ్ లో వచ్చిన 3-డోర్ వెర్షన్ మోడల్ రూ. 16.75 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరతో మరియు 5-డోర్ వెర్షన్ మోడల్ రూ.18 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ అయింది. రూ.25,000 టోకెన్ అమౌంట్ తో గురువారం నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త 5-డోర్ గూర్ఖాను మేము డ్రైవ్ చేయగా, ఫస్ట్ డ్రైవ్ కి సంబంధించిన రివ్యూ ఇక్కడ ఉంది.
గూర్ఖా మోడల్ 2021లో లాంచ్ అయినప్పటి నుంచి చూస్తే, 2024 ఫోర్స్ గూర్ఖా వెర్షన్ ద్వారా ఈ ఎస్యూవీ చాలా వరకు పూర్తి అప్ డేట్ ని పొందింది. కారు బయటి వైపు చూస్తే, కొత్త అల్లాయ్ వీల్స్, హెడ్ ల్యాంప్స్, మరియు గ్రిల్ ని పొందింది. 3-డోర్ గూర్ఖా 3.95 మీటర్ల పొడవు ఉండగా, 5-డోర్ మోడల్ 4.3 మీటర్ల పొడవు ఉంది. తర్వాత పేర్కొన్న 5-డోర్ మోడల్ లీగ్ లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మరియు హోండా ఎలివేట్ వంటి ఇతర కార్లతో పోటీగా నిలిచింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫోర్స్ బ్రాండ్ ఇందులో కొత్త అప్హోల్స్టరీ మరియు ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ని తీసుకువచ్చింది. ఇందులోని ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టిపిఎంఎస్, డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ఇన్ఫోటైన్మెంట్ కోసం 8-ఇంచ్ డిస్ ప్లే ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, గూర్ఖా 6స్పీడ్ మాన్యువల్ జతచేయబడి 132bhp/320Nm టార్కును ఉత్పత్తి చేసే 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. గూర్ఖా స్పెషాలిటీలో ఒకటి ఏంటి అంటే, లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు షిఫ్ట్-ఆన్-ది ఫ్లై 4WDతో దీని ఫోర్-వీల్ డ్రైవ్ ప్యాకేజీ ఉంది. ఇది 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్లలో స్టాండర్డ్ గా అందించబడింది.
ఇంకా, పోటీ విషయానికి వస్తే, గూర్ఖా మారుతి జిమ్నీ మరియు లోయర్-స్పెక్ మహీంద్రా థార్ తో పోటీపడుతుంది. తర్వాత పేర్కొన్న థార్ ఇదే సంవత్సరం ఆగష్టు నెలలో 5-డోర్ వెర్షన్ ని పొందనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్