- 9 ఐసీఈ మరియు 7 బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని రిలీజ్ చేయనున్న మహీంద్రా
- ఎలక్ట్రిక్ వెహికిల్స్ కంటే ఐసీఈ మోడల్స్పై ఎక్కువ పెట్టుబడి పెడుతున్న మహీంద్రా
మహీంద్రా & మహీంద్రా 2030 నాటికి తొమ్మిది ఐసీఈ మోడల్స్ మరియు ఏడు ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ)లను మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఈ ఐసీఈ మోడళ్ల విషయానికి వస్తే, ఇందులో ప్రధానంగా ఎస్యూవీలు ఉన్నాయి.అయితే, ఇదే సమయానికి బ్రాండ్ తన ఏడు ఈవీలను కంపెనీ బోర్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇంకో విషయం ఏంటి అంటే, 2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్యూవీమార్కెట్లో మహీంద్రా వాటా 20.04% కి చేరుకుంది.
ప్రస్తుతం, మహీంద్రా 9,000 వాహనాలను తయారుచేసే ప్లాంట్ కెపాసిటీని కలిగి ఉంది, అయితే బ్రాండ్ త్వరలో ఈ కెపాసిటీని మరింత పెంచుతున్నట్లు పేర్కొంది. మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓడాక్టర్ అనీష్ షా మాట్లాడుతూ, “మహీంద్రా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. అదే విధంగా మేము 10,500 వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్పై కాకుండా పెట్రోల్, డీజిల్పై దృష్టి సారిస్తున్న మహీంద్రా
ఐసీఈ మోడల్స్పై రూ.14,000 కోట్లు, ఈవీలపై రూ.12,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్లాన్ చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, బ్రాండ్ ఐసీఈ మోడళ్లపై ఎక్కువ దృష్టి సారిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ (ఆటో మరియు ఫార్మ్ సెక్టార్) రోజాష్ జెజురికర్ మాట్లాడుతూ, “మేము ఈవీలపై ఫోకస్ చేస్తున్న కారణంగా, అలా అని మేము ఐసీఈ మోడళ్లను విస్మరించలేము, కాబట్టి మహీంద్రా దాని వినియోగదారులకు తగిన ప్రొడక్ట్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది. సకాలంలో కస్టమర్లను సర్వీసు అందించాలని మరియు ఆ దిశగా మేము ఈ ప్రణాళికను రూపొందించాము.' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఉన్న XUV400 మార్కెట్లో విక్రయించబడుతుంది. కానీ కంపెనీ బోర్న్-ఎలక్ట్రిక్ చొరవ కింద మొదటి ఈవీ XUV.e8ని ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇది XUV700 కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. e8 తర్వాత, ఈ భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూపే-ఎస్యూవీ వెర్షన్ .e9 మరియు క్రెటా సైజులో ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా ఇండియన్ కస్టమర్ల కోసం పరిచయం చేయనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్