- ఇండియాలోప్రారంభ ధరలు రూ .6.13 లక్షలు
- అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న బేస్ వేరియంట్స్
హ్యుందాయ్ ఎక్స్టర్ మైక్రో-ఎస్యువిని జూలై 2023లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్ మరియు సిఎన్జి పవర్ట్రెయిన్ ఆప్షన్స్ తో 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, దానిసెగ్మెంట్ లో టాటా పంచ్ కి పోటీగా ఉన్నఈ 5-సీటర్ ఎస్యువి యొక్క మోడల్ వెయిటింగ్ పీరియడ్ వివరాలను మేము మీ ముందుకు తెచ్చాము.
ప్రస్తుతం, ఎక్స్టర్ యొక్క ఎంట్రీ-లెవల్ EX మరియు EX(O) వేరియంట్స్ పై 36 నుండి 38 వారాల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉంది. ఇది కాకుండా, పెట్రోల్ మరియు సిఎన్జి, అన్నిఇతర వేరియంట్ల పై బుకింగ్ చేసుకున్నరోజు నుండి 18 వారాలు నుండి 14 వారాల వరకు వరుసగా వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉంది.
ఫీచర్స్ పరంగా చూస్తే, ఎక్స్టర్ వాయిస్-ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ మొబైల్ కనెక్టివిటీతో 8-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఆంబియంట్సౌండ్ ఆఫ్ నేచర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ని పొందింది. స్పెసిఫికేషన్ల పరంగా కూడా,1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉండగా, ఇది 81bhp మరియు 113Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
మరో వార్తలో చూస్తే, దీని ఆటోమేకర్ ఇటీవల టాటా పంచ్ కు పోటీగా ఉన్న ఎక్స్టర్ ధరలను 1 జనవరి, 2024 నుండి పెంచింది. ఇందులోని పెట్రోల్ వేరియంట్ పై ఒకే విధంగా రూ.12,910 వరకు ధరలు పెరగగా, సిఎన్జి వేరియంట్లపై మాత్రం ఇప్పుడు రూ. 9,910 వరకు ధరలు పెరిగాయి. ఈ ధర పెరుగుదల తర్వాత, ఎక్స్టర్ ను ఇప్పుడు రూ. 6,12,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప