- మొదటిసారిగా 2017లో దేశీయ మార్కెట్లో ప్రవేశించిన నెక్సాన్ మోడల్
- ఐసీఈ మరియు ఈవీ రకాలలో లభ్యం
టాటా మోటార్స్ ఇండియాలో దాని పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ ద్వారా మరొక సరికొత్త మరియు ప్రాముఖ్యమైన మైల్స్టోన్ని సాధించింది. 2017లో లాంచ్ కాగా, అప్పటి నుంచి నేటి వరకు సబ్-4-మీటర్ ఎస్యూవీ 6 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్స్టోన్ని సాధించింది. గత సంవత్సరం ఏప్రిల్లో ఈ మోడల్ 5 లక్షల మైల్స్టోన్ మార్కును చేరుకుంది. గమనిస్తే, కేవలం 8 నెలల్లో టాటా కంపెనీ ఒక లక్ష నెక్సాన్ కార్లను ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఐసీఈ మరియు ఈవీ అనే రెండు రకాలలో రూ. 8.10 లక్షలుమరియురూ. 14.74 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో విక్రయించబడుతుంది. ఇక్కడ గమనిస్తే, కేవలం నెక్సాన్ ఐసీఈ వెర్షన్ మాత్రమే ఈ కొత్త మైల్స్టోన్ని అధిగమించింది.
మెకానికల్ గా, టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందించబడుతుంది. మొదటిది 118bhp పవర్ మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 113bhp పవర్ మరియు 260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటి, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్