- గతంలో ఎటి వేరియంట్లలో మాత్రమే అందించబడిన ఈ టెక్నాలజీ
- త్వరలోనే ధరలలో మార్పులు జరిగే అవకాశం
మారుతి సుజుకి టెర్మినాలజీలో ఎస్హెచ్విఎస్ అనగా స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని అర్థం, ఇది ఇప్పుడు బ్రెజా ఎస్యూవీలోని సెలెక్ట్ వేరియంట్లలో తిరిగివచ్చింది. మారుతి కంపెనీ టెక్ అనే దానిని కారు యొక్క ఎంటి వెర్షన్ల నుండి గత సంవత్సరం జూలై నెలలో తొలగించింది.
ఎస్హెచ్విఎస్ టెక్నాలజీ ఇప్పుడు ZXi మరియు ZXi+ వెర్షన్లలో తిరిగివచ్చింది. గతంలో ఈ ఫీచర్ కేవలం ఆటోమేటిక్ వెర్షన్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇప్పుడు ఈ అదనపు ఫీచర్ తో ఈ వెర్షన్ల యొక్క మైలేజీ 17.38కెఎంపిఎల్ నుండి 19.89కెఎంపిఎల్ వరకు పెరిగింది, ఫలితంగా 2.51కెఎంపిఎల్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే, ఎటి మరియు సిఎన్జి వేరియంట్లు వరుసగా 19.80కెఎంపిఎల్ మరియు 25.51కిమీ/కేజీ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తున్నాయి.
బ్రెజా-సబ్-4-మీటర్ ఎస్యూవీ యొక్క 1.5-లీటర్, 4-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 102bhp పవర్మరియు 137Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్జి వెర్షన్ 87bhp మరియు 121Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ తో పోటీ పడుతున్న మారుతి సుజుకి బ్రెజా ధరలు రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూం) తో ప్రారంభమయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్