- తాజాగా 4 లక్షల యూనిట్ సేల్స్ మైల్ స్టోన్ ని అధిగమించిన కియా సోనెట్
- కియా ఇండియా మొత్తం సేల్స్ లో 33 శాతం షేర్ ని కలిగి ఉన్న సోనెట్ మోడల్
సెప్టెంబర్-2020లో సోనెట్ లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే, తాజాగా సోనెట్ సబ్-ఫోర్-మీటర్ ఎస్యూవీ 4 లక్షల యూనిట్ సేల్స్ మైల్ స్టోన్ ని అధిగమించినట్లు కియా సోనెట్ ప్రకటించింది. డొమెస్టిక్ సేల్స్ ద్వారా 3.17 లక్షల కార్లను విక్రయించగా, 85, 814 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ సందర్భంగా మోడల్ కి సంబంధించిన కీలక నంబర్లను వెల్లడించింది.
కియా ప్రకారం, 63 శాతం కస్టమర్లు సోనెట్ కారును సన్ రూఫ్ వేరియంట్లతో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపింది. కియా కంపెనీ ఎంట్రీ-లెవెల్ HTE వేరియంట్లో సన్ రూఫ్ ని తీసుకురావడంతో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. సేల్స్ నంబర్స్ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ సేల్స్ వరుసగా, 63 మరియు 37 శాతంగా ఉన్నాయి.
ట్రాన్స్మిషన్ డిపార్టుమెంట్లో చూస్తే, డిసిటి మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్లు 28 శాతం షేర్ ని పొందగా, ఐఎంటి 23 శాతంతో దాని వెనుక స్థానంలో ఉంది. అదనంగా, డిసిటి వేరియంట్లు బెస్ట్ నంబర్లను అందించగా, 2020 నుంచి ఇవి 37.5 శాతంగా ఉన్నాయి. ఈ నంబర్లు అన్ని మోడల్ లాంచ్ అయినప్పటి నుంచి 44 నెలల క్రితం నుంచి సేకరించబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్